పూజ చేస్తానంటూ వచ్చి.. భయంతో పారిపోయిన బాబా.. ఏం జరిగిందంటే?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా భూతవైద్యుల కాలం నడుస్తుంది అంటే దానికి కారణం ప్రజల్లో ఇంకా పేరుకుపోయిన మూఢ నమ్మకాలు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎంతోమంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని నమ్ముతూ బురిడీ బాబాలా చుట్టూ తిరుగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే అమాయకులను టార్గెట్గా చేసుకొని ఎంతోమంది బురిడి బాబాలు అందినకాడికి దోచుకుంటున్న ఘటనలో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.. అయితే ఇటీవల కాలంలో అయితే కొంతమంది కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తూ మోసగాళ్ల బారినపడకుండా తప్పించుకుంటున్నారు.

 బీహార్లో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. బాలికకు భూతవైద్యం చేస్తాను అంటూ చెప్పి ఓ మాంత్రికుడు బాలికను గదిలోకి తీసుకు వెళ్ళి తలుపు లాక్ చేసాడు. కానీ కాసేపటికే గదిలోనుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేశాడు. ఇక ఏం జరిగిందో అని తల్లిదండ్రులు లోపలికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీహార్ లోని సీతామర్హి జిల్లా పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఒక కుటుంబంలో ఇటీవలే సమస్యలు వచ్చాయి. దీంతో ఇక మూఢనమ్మకాలను బాగా నమ్మే ఆ కుటుంబం ఓ బురిడీ బాబా ని పట్టుకుని పూజలు చేయించేవారు.

 ఈ క్రమంలోనే ఇటీవలే బురిడి బాబాకి ఈ విషయాన్ని తెలియజేశారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలో ఉన్న ఓ బాలికతో భూత వైద్యం చేయించాలి అంటూ చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే కేవలం 16 ఏళ్ల కూతురు ఇంట్లోకి వంటరిగా పంపించారు. అయితే ఇలా బాలికను గదిలోకి తీసుకు వెళ్లి తలుపులు వేసిన బాబా చివరికి అత్యాచారం చేశాడు. కానీ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో చివరికి తలుపులు తీసి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. అయితే ఏం జరిగిందో అని  కంగారుగా లోపలికి వెళ్లి చూశారు  తల్లిదండ్రులు. జరిగిన విషయం తెలుసుకుని గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: