ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలికకు 20 రోజులు నరకం..చివరికి..

Satvika
తల్లి దండ్రులు ఏదైనా ఒక మాట అంటే ఈరోజుల్లో ఎవరూ పడరు.. అదెందొ కానీ బయట ఎవరెన్ని అన్నా కూడా అసలు పట్టించుకోరు..కానీ ఇంట్లో ఎవరైనా ఒక మాట అంటే పౌరుషం తో వెళ్ళి పోతారు..అలా ఓ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది..అలా వెళ్ళి నరకంలో పడింది..దాని నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఆ అమ్మాయి ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తె ఎవరికైనా కన్నీళ్ళు రాకమానదు.. వివరాల్లొకి వెళితే..

14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులపై కోపంతో ఇంటి నుంచి పారిపోయింది.. బస్సులో ప్రయాణిస్తున్న ఆ బాలికపై ఓ వ్యక్తి కన్ను పడింది.. సహాయం చేస్తాననే సాకుతో అతను ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు..ఆ తర్వాత మరొక వ్యక్తికి అమ్మేశాడు. అతడు కూడా ఆ బాలికపై అత్యాచారం చేశాడు. 20 రోజుల నరక యాతన తర్వాత ఆ బాలికను పోలీసులు విడిపించారు.. మైనర్‌ను అత్యాచారం చేసి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది.
రాజస్థాన్‌లోని ముహనాలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలిక జూన్ 26 ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా కూతురి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ టీమ్ సహాయం తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి బాలిక భరత్‌పూర్‌ వెళ్లినట్టు తెలుసుకున్నారు. దేవ్‌పాల్‌ అనే వ్యక్తితో బాలిక వెళ్లడం గమనించి అతడిని పట్టుకున్నారు. అతడి ద్వారా మొత్తం విషయం తెలుసుకున్నారు. రూ.5000కు బబ్లూ అనే వ్యక్తికి ఆ బాలికను అమ్మేసినట్టు తెలుసుకున్నారు..అతను చెప్పిన అడ్రెస్ ప్రకారం అక్కడకు వెళ్ళి చూడగానే బాలిక ఉందని తెలుసుకొని విడిపించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..బబ్లూ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: