షాకింగ్ : మధ్యాహ్న భోజనం తిని.. విద్యార్థి మృతి.. ఎక్కడంటే?
ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఎంతో మంది పిల్లలు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాలలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు అటు తల్లిదండ్రులలో ఆందోళనకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న ఆహారానికి బదులు ఇక ఇంటి నుంచి విద్యార్థులు తమ వెంట టిఫిన్ బాక్సులు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించిన ఆహారం ఏకంగా ఒక విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
మధ్యాహ్న భోజనం తిని ఓ విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా గురజాలలో వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని.. పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వంపై ఇక ఈ ఘటనతో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.