తన మాట వినలేదని దారుణం..స్నేహితులతో కలిసి..

Satvika
ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం..అయితే ఇద్దరిలో ఒకరు ఓపికగా వుంటే గొడవలు వెంటనే తగ్గి పోతాయి..కానీ ఇద్దరు పంతానికి పోతే మాత్రం గొడవలు ఎక్కువ అవుతాయి.. ఇకపోతే ప్రెమించుకున్న ప్రతి జంట పెళ్ళి వరకూ వెళుతూంది అంటే లేదనే చెప్పాలి.. ఇప్పుడు కేవలం కామ కోరికలు తీర్చు కోవడానికి మాత్రమే ప్రేమ పేరును వాడుతున్నారు.. మరికొంతమంది పెళ్ళి వరకూ తీసుకెల్లాలని చూసిన కూడా ఎవరొకరు అడ్డు చెప్పడంతో ఆగిపొథుంది. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది..పెళ్ళికి ప్రియురాలు నో చెప్పిందని ఫ్రెండ్స్ తో కలిసి ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేశాడు..అది కాస్త పోలీసుల వరకూ వెళ్ళడంతో అసలు విషయం బయటకు వచ్చింది..



ప్రస్తుతం బీహార్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ఒకే ఒక్క విషయంలో తన మాట వినలేదని కోపం పెంచుకున్నాడు. ఓ రోజు ఊరి బయటకు రమ్మని అతడు చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..బీహార్ రాష్ట్రం సీతామర్హి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొహమ్మద్‌ అనే వ్యక్తి, 22ఏళ్ల యువతికి మధ్య ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. మొన్నటి వరకూ వారి మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదు. అయితే ఇటీవల పెళ్లి చేసుకుందామంటూ మొహమ్మద్‌.. తన ప్రియురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయమై రోజూ గొడవలు జరిగేవి. దీంతో ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు.



ఈ క్రమంలో జూన్ 24న ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచాడు. అక్కడికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన ఆమె.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. తర్వాత అయితే గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు కూడా పెళ్లి చేసుకోమని చెప్పడంతో చివరకు చేసేదేమీ లేక.. గురువారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: