విధి ఎంత చిత్రమైనది.. అల్లుడు మృతి.. గంటల్లోనే?

praveen
సాధారణంగా మనిషికి మరణం ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరికీ తెలియని విధంగానే ఉంటుంది. ఎందుకంటే.. బ్రహ్మ రాసిన రాతలో ఎప్పటి వరకు మనిషి భూమ్మీద నూకలుతినే భాగ్యం వుంటుంది అన్నది పెద్ద పెద్ద జ్యోతిష్యులు సైతం అసలు చెప్పలేరు. అయితే  కొన్ని కొన్ని సార్లు ఊహించని విధంగా మరణం సంభవించడం కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని పోతూ ఉంటుంది. అంతే కాకుండా ఆ బ్రహ్మ దేవుడు ఎవరి జీవితాన్ని ఎవరితో ముడి పెడతాడు అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కుటుంబంలో ఒకరు చనిపోయిన కేవలం గంటల వ్యవధిలోనే వారి మరణ వార్త మరొకరి గుండె చప్పుడు ఆపేస్తూ ఉంటుంది.

 ఇలా ఒకరి మరణం మరొకరి మరణం తో ముడిపడి ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇలాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతాయి అన్న దానికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అల్లుడు మృతి చెందిన వార్త వినగానే మామ గుండె ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన వడ్డే రాజు అనే 40 ఏళ్ల వ్యక్తి కి క్రిష్ణగిరి కి చెందిన వడ్డే అంజనప్ప కుమార్తె తో 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. తర్వాత దంపతులు క్రిష్ణగిరి వచ్చి అక్కడే పనులు చేసుకుంటున్నారు.

 అయితే రాజు గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. అయితే ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిన చివరికి అతని సమస్యలు నయం కాలేదు. చివరికి మృతి చెందాడు. అయితే పక్క వీధిలో నివాసముంటున్న రాజు మామ అంజనప్ప ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో అల్లుడి మరణవార్త అతని గుండె చప్పుడు ఆపేసింది. ఇలా అల్లుడు మృతిచెందిన గంటల వ్యవధిలోనే మామ కూడా గుండెపోటుతో ప్రాణం విడిచాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: