కట్టుకున్న భర్త కాల యముడు అయ్యాడు.. అత్యంత దారుణంగా చంపి..

Satvika
మధ్యానికి బానిసలు అయితే వారిని మార్చడం చాలా కష్టం..ఏది చెప్పిన కూడా చెవిన పెట్టరు.. ఇటీవల కాలంలో మద్యం మత్తులో భార్యలను అతి కిరాతకంగా భర్తలు చంపిన ఘటనలు ఎక్కువ వినిపిస్తున్నాయి..తనకున్న దురలవాటుతో కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇది మంచి పద్దతి కాదని చెప్పిన భార్యను కడతేర్చారు. అత్యంత క్రూరంగా..ఉన్మాదంతో ఓ భర్త తన అర్ధాంగి ప్రాణాలు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లొకి వెళితే..ఈ ఘటన తెలంగాణ నిజామాబాద్‌ లో వెలుగు చూసింది.20ఏళ్లు తనతో కలిసి కాపురం చేసిన భార్య మాటలకు కోపోద్రేకుడైన భర్త ఆమెను చంపి నేరస్తుడిగా మారాడు.భీమ్‌గల్ మండలం పురాణీపేట్‌కు చెందిన తెడ్ల నగేశ్ కులవృత్తి వడ్రంగి పని చేసుకుంటున్నాడు. భార్య లావణ్యతో కలిసి కొన్నేళ్లుగా భీమ్‌గల్‌ పట్టణం రాజారాంనగర్ కాలనీలో కాపురముంటున్నాడు. నగేష్, లావణ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు హైదరాబాద్‌లో సీఎ చేస్తోంది. కొడుకు లావణ్య సోదరి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. పిల్లలు దూరంగా ఉండటంతో కేవలం భార్య,భర్తలిద్దరు మాత్రమే ఒక అద్దె ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. కార్పెంటర్‌ వర్కర్ అయిన నగేష్‌ మద్యానికి బానిసయ్యాడు. రోజు మద్యం తాగొచ్చి భార్య లావణ్యను వేధించసాగాడు.

శనివారం కూడా రాత్రి మద్యం తాగొచ్చాడు నగేష్. ఇంట్లో భార్య, భర్తలు గొడవపడ్డారు. మద్యం తాగడం మానేయాలని భార్య లావణ్య నగేష్‌కి సూచించింది. ఆ మాటకు కోపంతో రగిలిపోయిన నగేష్‌ లావణ్య చీర కొంగుతో మెడకు చుట్టి ఉరితాడులా బిగించాడు. దాంతో ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. భార్యను ఊపిరాడకుండా చేసినప్పటికి తన కోపం చల్లారకపోవడంతో నగేష్ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఉన్న ఇనుప ముక్కను కాల్చీ చేతులపై వాతలు పెట్టాడు. అటుపై ఆమె చేతులు విరిచాడు. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు..నగేష్, లావణ్య ఇంట్లో గొడవపడటం గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు.తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..అతను జైలుకు వెళ్ళడంతో ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: