మరో వ్యక్తితో ఎఫైర్..నగదును తీసుకొని..

Satvika
ఈ మధ్య కాలంలో అక్రమ సంబందాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మగవారితో పోలిస్తే ఆడవారి లో ఎక్కువగా ఇలాంటి సంభంధాల కు లొనయ్యి పచ్చని సంసారాలను పాడు చేసుకుంటూన్నారు.. కొందరు ఏకంగా సంసారం పిల్లలను వదిలి పెట్టి ప్రియుడితో చెక్కెస్తున్నారు.. మరికొంతమందిని ఏకంగా ప్రాణాలను తీస్తున్నారు.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటనలు జనాలను ఆశ్చర్యానికి గురి చెస్తుంది. భర్త వుండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది ఓ మహిళ.. అయితే భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయింది.


పోతూ పొతూ ఒట్టి చేతుల తో పోకుండా ఇంట్లో ఉండే డబ్బులను , సొమ్ములు, ఇంటి పత్రాల ను తీసుకొని వెళ్ళింది.. భార్య కనిపించలేదని పోలీసులvకు ఫిర్యాధు చేసాడు భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అందులో భాగంగా కొన్ని విషయాల ను చెప్పడం తో అందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి కుమ్మరి బజార్‌ లో వల్లెపు లక్ష్మణ, కుమారిల కుటుంబం నివాసం ఉంటుంది. లక్ష్మణ లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా, కుమారి దుర్గగుడిలో స్వీపర్‌గా పని చేస్తుంది.


విషయాన్నికొస్తే.. ఆమె గత కొంత కాలంగా మరో వ్యక్తి తో సన్నిహితం గా ఉంటుంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి లక్ష్మణ భార్యను నిలదీశాడు. మరో సారి ఇటువంటి పనులు చేయనని పెద్దల మధ్యన రాజీ కుదిరింది. మంగళ వారం ఉదయం కుమారి ఇంట్లో ఉన్న రూ. 20 వేల నగదు, ఇంటి కాగితాలు తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో భర్త తెలిసిన వారిని ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఆమెను వెతికే పనిలో పోలీసులు బిజిగా ఉన్నారు.ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: