అర్దరాత్రి ఎవరో తలుపు కొట్టారు.. తెరిచి చూసి షాక్?
కామంతో కళ్లు మూసుకు పోయి తాము మానవత్వం ఉన్న మనుషులం అన్న విషయాన్ని మరిచి పోతున్న ఎంతోమంది.. మానవమృగాల్లా చివరికి దారుణంగా మహిళలపై అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదలడం లేదు. దీంతో రోజు రోజుకి ఆడపిల్లల రక్షణ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఇటీవలికాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మరింత పెరిగి పోయాయి అని చెప్పాలి. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకు వచ్చినా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా వుడా కాలనీ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళపై గుర్తుతెలియని దుండగుడూ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఉపాధి కోసం పార్వతీపురం మాన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చింది. అక్కడ ఒక టి దుకాణంలో పని చేస్తుంది. ఇక ఇటీవలే అర్ధరాత్రి పిల్లలతో కలిసి నిద్రొస్తుంది. అదే సమయంలో ఒక దుండగుడు తలుపు కొట్టాడు. తలుపు తీయగానే బలవంతంగా లోపలికి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..