అసలు వీడు టీచరేనా.. ఛీ ఛీ ఇలా చేస్తాడా?

praveen
తల్లి తండ్రి తరువాత గురువే దైవం అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రి జన్మనిస్తే గురువు మాత్రం ఇక ప్రతి ఒక్కరు కూడా జీవితం లో సరైన మార్గం లో నడవడానికి తోడ్పాటు అందిస్తూ ఉంటారు. అందుకే టీచర్ వృత్తి ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలం లో మాత్రం ఎంతో మంది ఉపాధ్యాయులు టీచర్ వృత్తికే కళంకం తెచ్చే విధం గా వ్యవహరిస్తూ ఉంటారు. తమ దగ్గర చదువుకున్న పిల్లలను బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి వికృత చేష్టలు ప్రదర్శిస్తూ చివరికి టీచర్ వృత్తికే మచ్చ తెస్తున్నారు.

 ఇక్కడ ఒక టీచర్  ఇలాంటిదే చేసాడు. అభం శుభం తెలియని విద్యార్థులను టీచర్ లైంగికం గా వేధించిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో వెలుగు లోకి వచ్చింది. చిల్లకొండాయపల్లి ప్రాథమిక పాఠశాల లో అబూ అనే 58 ఏళ్ల ఉపాధ్యాయుడూ పనిచేస్తున్నాడు. నాలుగు ఐదవ తరగతి చదువుతున్న 11 విద్యార్థులకు లైంగికం గా వేధిస్తూ ఉండేవాడు. ఇక విద్యార్థుల పట్ల పైశాచికం గా ప్రవర్తించాడు. చిత్ర హింసలకు గురిచేసే వాడూ. ఎవరికైనా ఈ విషయం చెబితే టీసీ ఐసీసీజీ పంపేస్తా అంటూ బెదిరించేవాడు. అంతే కాకుండా చాక్పీస్ కి తాడు ముడివేసి కట్టేస్తాను అంటూ విద్యార్థులను భయపెట్టేవాడు.

 ఎన్నో రోజుల నుంచి ఉపాధ్యాయుడి వేధింపులు భరించిన విద్యార్థినులు ఇటీవలే ధైర్యం చేసి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. ఈ క్రమం లోనే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి సదరు బాధిత బాలిక తండ్రి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. ఇక ఈ ఘటన కలెక్టర్ వరకు వెళ్ళింది. చివరికి ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించాడు.  ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: