అసలు వీడు టీచరేనా.. ఛీ ఛీ ఇలా చేస్తాడా?
ఇక్కడ ఒక టీచర్ ఇలాంటిదే చేసాడు. అభం శుభం తెలియని విద్యార్థులను టీచర్ లైంగికం గా వేధించిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో వెలుగు లోకి వచ్చింది. చిల్లకొండాయపల్లి ప్రాథమిక పాఠశాల లో అబూ అనే 58 ఏళ్ల ఉపాధ్యాయుడూ పనిచేస్తున్నాడు. నాలుగు ఐదవ తరగతి చదువుతున్న 11 విద్యార్థులకు లైంగికం గా వేధిస్తూ ఉండేవాడు. ఇక విద్యార్థుల పట్ల పైశాచికం గా ప్రవర్తించాడు. చిత్ర హింసలకు గురిచేసే వాడూ. ఎవరికైనా ఈ విషయం చెబితే టీసీ ఐసీసీజీ పంపేస్తా అంటూ బెదిరించేవాడు. అంతే కాకుండా చాక్పీస్ కి తాడు ముడివేసి కట్టేస్తాను అంటూ విద్యార్థులను భయపెట్టేవాడు.
ఎన్నో రోజుల నుంచి ఉపాధ్యాయుడి వేధింపులు భరించిన విద్యార్థినులు ఇటీవలే ధైర్యం చేసి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. ఈ క్రమం లోనే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి సదరు బాధిత బాలిక తండ్రి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. ఇక ఈ ఘటన కలెక్టర్ వరకు వెళ్ళింది. చివరికి ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించాడు. ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి..