పోలీసులు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేదు.. చివరికి బద్దలుకొట్టి చూస్తే?

praveen
ఇటీవల కాలంలో మనుషులు మానవ మృగాలు గా మారిపోతూ సొంత వారి విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తోన్నాయ్. ఏకంగా సొంత వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులు గా మారిపోతున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక ప్రతిక్షణం ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
 ఇక్కడ జరిగిన ఘటన  ఓ తల్లికి ఇలాంటి ఒక అరణ్యరోదనే మిగిల్చింది. కూతురికి  ఎంతలా ఫోన్ చేసినా స్పందించలేదు.
 దీంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానం కలిగింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి చెప్పింది. దీంతో పోలీసులు ఇంటికి వెళ్ళి చూసే సరికి అక్కడ ఊహించని ఘటన. ఏకంగా ఇంట్లో ఓ మహిళ తో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఓ వృద్ధురాలు మృతి దేహాలు లభ్యమయ్యాయి. గుజరాత్ లో ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ బిరాట్ నగర్ లో  సొసైటీలో సోనాల్ కుటుంబం ఉంటుంది. సోనాల్ తో పాటు భర్త వినోద్ కుమారుడు గణేష్ కూతురు ప్రగతి ఇక ఆమె అమ్మమ్మ సుభద్ర ఉంటున్నారు.

 అయితే సోనాల్ తల్లి గత కొన్ని రోజులుగా కూతురికి ఫోన్ చేస్తూ ఉంది.కానీ సోనాలి మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. నాలుగు రోజులైనా ఎలాంటి స్పందన లేదు. ఇక అల్లుడు ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దీంతో ఏదో జరిగిందని అనుమాన పడింది సోనాల్ తల్లి. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి విషయం చెప్పింది. ఈ క్రమంలోనే పోలీసులు సోనాల్ ఇంటికి వెళ్లి చూశారు. కాలింగ్ బెల్  కొట్టిన ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. దీంతో భరించలేని దుర్వాసన వేర్వేరు గదుల్లో నాలుగు మృతదేహాలు లభించాయి. అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినోద్  పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతనే హత్య చేసి ఉంటాడని  అనుమానిస్తున్నారు. పోలీసులు హత్య ఎందుకు జరిగింది అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: