భర్తలో మార్పు కోసం భార్య ఎంతపని చేసింది?

Satvika
దేశంలో రాజకీయ పార్టీలు మారుతున్నాయి. కొత్త పార్టీలు వస్తున్నాయి. కానీ ప్రజలు బానిసలుగా మారుతున్నా మద్యం పాన నిషేధం మాత్రం ఎక్కడా జరగలేదు.. మద్యం మత్తులో కుటుంబాలు ఎన్నో రోడ్ల మీద పడుతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అవి చేస్తాము, ఇవి చేస్తాము అని వాగ్దానాలు చేస్తారు తీరా వాళ్ళ పార్టీ అధికారం లోకి రాగానే చెప్పిన మాటలు నోటి మాటలుగా మిగిలిపోతాయి.. మద్యం వల్ల ఎన్నో సంసారాలు నాశనం అయ్యాయి. అంతేకాదు, ప్రాణాలు ను కూడా కోల్పోతున్నారు.. తాజాగా ఓ మహిళ భర్త ను మద్యం మానెయ్యాలని కోరింది.


ఆమె 8 నెలల గర్భవతి అయిన తను మాత్రం మానుకోలేదు.. మద్యం మానుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది.చివరికి తన మాటను భర్త లెక్కచెయలెదని మనస్తాపం తో ఉరి వేసుకొని చనిపొయింది.. విషయాన్నికొస్తే.. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగు చూసింది. తిరువనంతపురం జిల్లా లోని కల్లారా పట్టణాని కి చెందిన భాగ్య 8నెలల గర్భవతి. మణి విలాసమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోని తమ ఫ్లాట్ లో ఆదివారం సాయంత్రం ఆమె విగతజీవిగా కనిపించారు..ఇంట్లో వుండే ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపొయింది.


అక్కడున్న వారి సమాచారం మేరకు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చెరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రి కి తరలించారు. మద్యం మానెస్తె కుటుంబం బాగుంటుంది. అని ఆమె 8 నెలల కడుపు ను చూపించి ఎన్నో సార్లు వేడుకుంది. కానీ అతని ప్రవర్తన లో మాత్రం మార్పు రాలేదు. మద్యం మానేస్తానని మాట వరుసకైనా చెప్పలేదు. ఆదివారం నాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భాగ్య ను తిట్టిపోసి భర్త బయటికి వెళ్లిపోయాడు. అతను బయట కు వెళ్లిపొగానె కోపంతో ఉరి వేసుకొని చనిపొయింది.. కోపంలో తీసుకొనే నిర్ణయాలు జీవిథాలను నాశనం చేసుకుంటున్నారు..ఈమె మరణం తో అయిన మద్యం అమ్మకాలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: