దారుణం: పెళ్లింట్లో చావు మేళం - రోడ్డు ప్రమాదంలో 9మంది మృతి..!!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోకా వెంకటప్ప కుమారై వివాహం ఆదివారం నాడు కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఘనంగా జరిపించారు. అయితే ఈ వేడుక అనంతరం వెంకటప్ప బంధువులతో కలసి ఇన్నోవా వాహనంలో స్వగ్రామానికి స్టార్ అయ్యారు. ఇక వీరు సరిగ్గా ఉరవకొండ మండలం బూదగవి వద్దకు రాగానే కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో.. ఇన్నోవా నుజ్జునుజ్జయింది. అయితే ఈ వాహనంలో ఉన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల్లో 5మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
అయితే రోడ్డు ప్రమాదంలో సంఘటన తెలుసుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఇక సంఘటనా స్థలం వద్ద అవసరమైన సహాయ సాకారాలు అందించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అంతేకాదు.. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సంఘటనా స్థాలానికి పరిశీలించి అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇక ఉరవకొండ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిని బొమ్మనహాళ్కు చెందిన అశోక్, రాధమ్మ, సరస్వతి, శివమ్మ (పిల్లలపల్లి), శుభద్రమ్మ (రాయలదొడ్డి), లత్తవరానికి చెందిన స్వాతి(38), జాహ్నవి (12), జశ్వంత్ (12), నింబగల్లుకు చెందిన వెంకటప్ప(60)గా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఉరవకొండ ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అంతేకాదు.. మ్మగళ్లు గ్రామ పెళ్లి ఇంట్లో జరిగిన విషాదంలో పెళ్లి కుమార్తె తండ్రి సహా చిన్న పిల్లలు చనిపోయిన ఘటన కలచివేసిందని అన్నారు.