ప్రాక్టికల్స్ పేరుతో.. 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకోగా.. కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రిన్సిపాలే కామాంధుడిగా మారి ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ జిల్లాలో గత నెల 18న ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు ఓ పాఠశాల ప్రిన్సిపల్ 17 మంది బాలికలను వేరే పాఠశాలకు తీసుకెళ్లాడుతీసుకెళ్లాడు. దీంతో ఆ బాలికలు ఆ రోజు రాత్రి అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో అప్పుడు మరొకరితో కలిసి ఆ పాఠశాలప్రిన్సిపల్ వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తున్నది. బాలికలకు ఇచ్చే ఆహారంలో మత్తుమందు కలిపి.. వారిపై అత్యాచారానికి కూడా యత్నించినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షలలో ఫెయిల్ చేస్తాం అని.. కుటుంబసభ్యులను చంపేస్తామని వారు బెదిరించారు. మొత్తానికీ ధైర్యం చేసి ఈ వివరాలను బాలికలు వారి తల్లిదండ్రులకు కాస్త ఆలస్యంగా చెప్పారు. ఈవిషయం తెలిసిన తల్లిదండ్రులు మూకుమ్మడిగా ఒక్కసారిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు అని.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వల్ జోక్యం చేసుకున్న తరువాత పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అప్పుడే ఈ ఘటన వెలుగులోకి వచ్చినది. తాజాగా ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ మహిళా కమిషన్ చర్యలు చేపట్టింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను తమకు చెప్పాలని ముజఫర్నగర్ జిల్లా మెజిస్ట్రేట్ను ఆదేశించినది.