విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అతడేనట?

praveen
ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి.  ఇక ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలిపోతుంటాయి.  అయితే అటు ప్రేమించడం అనేది ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇష్టం ఉంటే ప్రేమిస్తారు లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేస్తారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇష్టం లేదు అని చెప్పడమే శాపంగా మారిపోతుంది. ఎంతోమంది ప్రేమోన్మాదులు రెచ్చి పోయి మరి అమ్మాయిలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా తమ ప్రేమను రిజెక్ట్ చేసింది అన్న కారణంతో ఏకంగా ప్రేమోన్మాదులు దారుణంగా హత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇలా నేటి రోజుల్లో ప్రేమించడం లేదు అని మనసులో మాట బయటకు చెప్పడమే పాపంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని వెంట ప్రేమించాలంటూ యువకుడు వెంట పడటం మొదలు పెట్టాడు. అయితే ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అంటూ ఆ యువతి చెప్పినా అతను వినిపించుకోలేదు. రోజురోజుకీ అతని వేధింపులు ఎక్కువయ్యాయి. ఓ రోజు ధైర్యం చేసి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు ఆ యువకుడిని మందులించ్చారు. కానీ అతని తీరులో మార్పు రాలేదు  వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యాయ్  దీంతో ఆ విద్యార్థిని జీవితమే భారంగా భావించి చివరికి బలవన్మరణానికి పాల్పడింది.

 ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఖమ్మం  మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది  అయితే ఇక ఆ బాలిక బడికి వెళ్ళే దారిలోనే సాయి కృష్ణ అనే యువకుడు ఉంటాడు. గత కొంత కాలం నుంచి ఆ యువకుడు బాలికను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు ఆ యువకుడిని మందలించారు. కానీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. బాలిక పాఠశాల కు వెళ్లి వస్తుండగా వెంట పడటం మొదలు పెట్టాడు. ప్రేమించకపోతే చచ్చిపోతాను అంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. దీంతో ఆ బాలిక మనసు గాయపడింది. ఇక బ్రతుకే భారం అనుకొని చివరికి చిన్న వయసులోనే కఠిన నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: