కాలేజీ లెక్చరర్ పై మోజుపడ్డ విద్యార్థి.. చివరికి..?

MOHAN BABU
పూర్వకాలంలో గురువులంటే ఎంతో భయం భక్తి ఉండేది. అక్కడి నుంచి టీచర్ వస్తున్నారు అంటేనే గుండెల్లో వణుకు పుట్టేది. అలాంటిది ప్రస్తుత సమాజంలో పిల్లలు మారారు. అట్టి గురువులు మారారు. వరసలు  అనేవి లేకుండా ప్రవర్తిస్తున్నారు. క్షణిక  ఆవేశంలో అన్ని చేస్తున్నారు. కొంతమంది టీచర్లతో ప్రేమలో పడటం. ఇలా పలు రకాలుగా వారి యొక్క ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఆ మోజులో పడితే వయస్సు బేదాలు తెలియకుండా ఒక్కోసారి విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
 ఒక విద్యార్థి  విద్యాబుద్ధులు నేర్పే టీచర్ పై ప్రేమలో పడి  శారీరకంగా కలవాలని వేధిస్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి  వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రాంతంలో  రంజిత్ ఓ విద్యార్థి తన యొక్క కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ రంజిత్ వారికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ సందర్భంలో కాలేజీ లో జరిగే టువంటి ఒక ఈవెంట్ కు అదే ప్రాంతానికి చెందినటువంటి ఓ మహిళా టీచర్ హాజరైనది. సరదాగా ఆ టీచర్ రంజిత్ ను చూసి స్మైల్ ఇచ్చి, కొద్దిసేపు మాట్లాడినది. దీంతో రంజిత్ ఆ మేడంపై మనసును పారేసుకున్నాడు. అనంతరం ఎమోషనల్ మాటలు మాట్లాడుతూ ఏకంగా ఉపాధ్యాయురాలిని ప్రేమలోకి దించాడు. దీంతోపాటుగా రంజిత్ కొంతకాలం ఆ టీచర్ తో కలిసి సహజీవనం కూడా చేశాడు. కానీ రంజిత్ కు గతంలో నుంచి పలువురితో వివాహేతర సంబంధం ఉండడంతో పాటు  ఆ యొక్క కాలేజీలో చదువుకుని యువతులతో కూడా ఎఫైర్లు  ఉన్నాయని సదరు ఉపాధ్యాయురాలికి తెలిసింది. దీంతో ఆమె కొద్దిరోజుల పాటు తనకి దూరంగా ఉండమని రంజిత్ ను కోరింది.

 ఒకసారి ఇంటికి వస్తే ఇంటి నుంచి కూడా గెంటేసింది. అయినా రంజిత్ కు ఆమె పై మోజు తీరకపోవడంతో ప్రతిరోజు లైంగికంగా వేధించసాగాడు. అలా రంజిత్ ఆగడాలకు అడ్డూ లేకుండా పోయింది. దీంతో విసుగు చెందినటువంటి ఉపాధ్యాయురాలు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించి నటువంటి పోలీసులు రంగంలోకి దిగి రంజిత్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో రంజిత్ శృంగారం కోసమే కొద్దికాలంగా ఉపాధ్యాయురాలిని వేధిస్తున్నారని ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: