ఇక స్టాక్ మార్కెట్లో అస్థిరత అనేది చాలా సాధారణం.. గత కొద్ది సంవత్సరాలు స్టాక్ మార్కెట్లు బాగా రాణిస్తున్నాయి. కానీ 2020లో కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు బాగా పడిపోయాయి.కానీ ఇక ఆ తర్వాత మళ్ళీ రాణించాయి. కోవిడ్-19 తర్వాత మార్కెట్లు లాభాల్లో బాగా కొనసాగాయి. కొత్త గరిష్ఠాలను కూడా తాకాయి. కానీ రష్యా ఇంకా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మార్కెట్లో అస్థిరత అనేది పెరిగింది. ఇక 2021 అక్టోబర్ 19న బీఎస్ఈ సెన్సెక్స్ మొత్తం 62245.43 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ వచ్చేసి 18604.45 చేరుకుంది. కానీ కొద్ది వారాలుగా ఈ స్టాక్ మార్కెట్లో తీవ్ర అస్థిరత కారణంగా 2022 జూన్ 15న సెన్సెక్స్ 52,541 ఇంకా నిఫ్టీ 15,692కు పడిపోయింది. అటు అంతర్జాతీయంగా కూడా అస్థిరత అనేది ఉంది. 2021 నవంబర్ 22 52 వారాల గరిష్ఠ స్థాయి 16,212 వద్ద ఉన్న యూఎస్ ట్రేడింగ్ ఇండెక్స్ నాస్డాక్ అనేది క్రమంగా పడిపోతూ 2022 మే 20న 11,035తో 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది.2020-2021లో కరోనా వైరస్ కారణంగా మార్కెట్లోకి పెద్ద మొత్తం డబ్బును ఇన్ఫ్యూస్డ్ చేయడం ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది. యూఎస్ ఇంకా యూకెలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది.
భారత్లో కన్సూమర్ ప్రైస్ ద్రవ్యోల్బణం మొత్తం 8 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఏప్రిల్ నెల కన్సూమర్ ప్రైస్ ద్రవ్యోల్బణం 7.79గా నమోదు అయింది. ఇక దీంతో భారతీయ సెంట్రల్ బ్యాంక్ అయినా రిజర్వ్ బ్యాంక్ ఇండియా వడ్డీ రేట్లు పెంచక తప్పలేదు. మే 4 వ న ఇటీవలి ఆఫ్-సైకిల్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత RBI గవర్నర్, శక్తికాంత దాస్ అనిశ్చితపై ఆందోళనలను కూడా వ్యక్తం చేశారు. “ఇక ద్రవ్యోల్బణం చాలా కాలం పాటు ఈ స్థాయిలలో పెరిగినట్లయితే.. అది ఖచ్చితంగా అంచనాలను తగ్గించగలదు. ఇంకా స్థిరమైన అధిక ద్రవ్యోల్బణం తప్పనిసరిగా పొదుపులను కూడా దెబ్బతీస్తుంది, పెట్టుబడి, పోటీతత్వం ఇంకా ఉత్పాదక వృద్ధి దెబ్బ తీస్తుంది. ఇది పేద ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడం ద్వారా కూడా వారిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది” అని దాస్ తన ప్రకటనలో తెలిపడం జరిగింది. ఇంకా అలాగే దాస్ పాలసీ రెపో రేటులో ఆఫ్-సైకిల్ 40 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించడంలో కూడా ఆశ్చర్యం లేదు.