ఆస్ట్రేలియాలో అధాని బొగ్గు గనులు కొనేశాడా..!

MOHAN BABU
ఆస్ట్రేలియాలో అదాని గ్రూప్ బొగ్గు తవ్వకాల ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. దశాబ్దకాలంగా క్వీన్స్ ల్యాండ్ ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలను ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కదలించ లేకపోయాయి. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, బడా కార్పొరేట్ అయిన గౌతమ్ అదానీకి ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడింది. దాంతో అక్కడ అదానీ కంపెనీ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ దక్కాయి. ఆస్ట్రేలియా బొగ్గును విదేశాలకు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో అదానీ కంపెనీ బొగ్గు భారత్ కు దిగుమతి చేసి, ఇక్కడున్న ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపడతారని సమాచారం.

 ఆస్ట్రేలియా నుంచి కోటి టన్నుల బొగ్గు ఈ నెలాఖరుకల్లా భారత్ కు రాబోతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన కార్గో ఓడల షెడ్యూల్ కూడా సిద్ధమైందని అదానీ కంపెనీ వర్గాలు మీడియాకు తెలిపాయి.క్విన్స్ ల్యాండ్ కార్మిఖాల్లో విస్తారంగా ఉన్న బొగ్గు ఇకపై అమెరికా, భారత్,జపాన్, చైనా, ఇతర దక్షిణాసియా దేశాలకు సరఫరా చేయాలని అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 2010లో ప్రారంభమైన ఈ ప్రాజె క్టుకు స్థానిక ప్రజల నుంచి పర్యావరణ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూప్ అక్రమంగా రుణాలు సేకరించిందని, పర్యా వరణాన్ని దెబ్బ తీస్తుందని న్యాయ స్థానాల్లో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.అయితే ఆస్ట్రే లియా ప్రభుత్వం నుంచి ప్రధాని గ్రూపునకు గట్టి మద్దతు లభించడంతో దాదాపు 100కు పైగా వివిధ విభాగాల నుంచి అన్ని రకాల అను మతులు దక్కాయి.ఈ ప్రాజెక్టు నిమిత్తం రుణాలు ఇచ్చిన ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకుల ముందు, ఇన్సూరెన్స్ కంపెనీల ముందు, పెట్టుబడిదారుల ముందు పర్యావరణ ప్రేమికులు నిరసనలు చేపట్టారు. పర్యా వరణానికి పెను ముప్పు గా మారిన ఈ ప్రాజెక్టుకు సహకరించ వద్దని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: