పెట్రో ఒత్తిడి.. ఎలక్ట్రిక్ వాహనాల ఊపు కోసమేనా..!
ఈ రెండు అడుగులు వేయడం ద్వారా ఓట్ల పట్ల కాకుండా దేశం ముందడుగు వేయడం ముఖ్యం అనే విషయాన్ని బీజేపీ నిరూపించింది. ఓట్ల కోసమే అయితే నాడు నిర్ణయం కూడా లేకుండా పోయేది. ప్రపంచం ముందు భారత్ డిజిటల్ గా మరో శతాబ్దం లో కూడా ముందుకు వచ్చి ఉండేది కాదు. అలా దేశం ముందడుగు వేయడంలో మోడీ సర్కార్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే ధోరణిలో కేవలం కాలుష్యం నివారణకు విద్యుత్ వాహనాల వినియోగ ప్రోత్సహం కోసమే పెట్రోల్ ధరలు తీవ్రంగా పెంచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికి ఇది భారంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో దేశంపై మంచి ప్రభావం ఉంటుందనేది వాళ్ళ అభిప్రాయం.
ఈ తరహా మొండి నిర్ణయాలు తీసుకోవడం కూడా భారత్ ను ప్రపంచం ముందు తలెత్తుకు నిలబెట్టడానికి పనికి వస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఇది కూడా విజయవంతం అయితే దేశంలో విద్యుత్ వాహనాలు విపరీతంగా పెరిగిపోతే కాలుష్య భారం చాలా తగ్గుతుంది. ప్రస్తుతం దేశ రాజధాని పరిస్థితి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆ స్థితి మరో నగరానికి రాకుండా చూసుకోవడం అందరి బాధ్యత, ఆ బాధ్యత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అందరిని దానిని కట్టుబడి ఉండేట్టు చేస్తుంది. అందుకే పెట్రో వత్తిడి కాలుష్యాన్ని తగ్గించేందుకు చేస్తున్న భారీ ప్రయత్నంగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.