ఇవాళ ఏపీకి రాష్ట్రపతి రాక.. ఎందుకంటే..?
విశాఖలో జాతీయ రహదారుల సంస్ధ ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. నూతన రహదారులకు ప్రారంభించి, శంఖుస్థాపనలు చేస్తారు. ఈనెల 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ నుంచి తిరుపతి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత గోశాలను సందర్శించి..పద్మావతి మహిళా యూనివర్సీటీ విద్యార్థులతో భేటీ అవుతారు. తిరుపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి నేరుగా దిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన కోసం...పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.