భారత్ బ్యాన్?.. చైనా కంపెనీ ఎంఐ షేర్ డామ్?
ఒక్క షియామీ మాత్రమే కాదు.. ఒపో, వివో వంటి చైనా సంస్థలు కూడా కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఈ సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై అనుమానాలతో భారత పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. వేల కోట్ల రూపాయలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సంస్థలు నగదును విదేశాలకు అక్రమంగా తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణాలతో ఇప్పుడు చైనా మొబైల్ ఫోన్ సంస్థలకు ఇండియాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.