అమరావతిలో జగన్ అమ్మే భూములు ఇవేనా?
మరి ఇంతకీ జగన్ సర్కారు అమ్మాలని భావిస్తున్న భూములు ఏవి.. ఏవంటే.. గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీ కోసం ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. అవి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి. ఈ 100 ఎకరాలు ప్రభుత్వం అమ్మే ఆలోచనలో ఉందట. అలాగే లండన్లోని కింగ్స్ కాలేజీకి
ప్రభుత్వం 148 ఎకరాల్ని కేటాయించింది. అవి కూడా ఖాళీగానే ఉన్నాయి. ముందుగా బీఆర్ షెట్టి మెడిసిటీ కి కేటాయించిన భూములు.. ఆ తర్వాత లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన భూములు అమ్మాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఇకపై సీఆర్డీఏ ఏటా 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల వరకూ అమ్మే ఆలోచనలో ఉన్నట్టు ప్రముఖ దిన పత్రిక పేర్కొంది.