అది అక్రమ సంబంధమే అంటున్న ఆర్కే?

Chakravarthi Kalyan

ఇటీవల గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ పై అత్యాచారం చేసి చంపారనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్‌ పై స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. ఆ మహిళ హత్యకు అక్రమ సంబంధమే కారణమని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  తన అనుచరులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే  ఆరోపించారు. ప్రతి అంశంపైనా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆర్కే అంటున్నారు. తుమ్మపూడి ఘటనకు రాజకీయ రంగు పులమేందుకు లోకేష్ యత్నించారని ఆర్కే విమర్శించారు. చుట్టుపక్కల నుంచి నాయకులను తీసుకొచ్చి రెచ్చగొట్టారని ఆర్కే అన్నారు. ప్రశాంతంగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు శాంతిభద్రతలు లేకుండా చేస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: