హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ.. ఏం చేస్తారంటే?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిన్న వరంగల్‌లో భారీ బహిరంగ సభకు హాజరైన రాహుల్.. రాత్రి మళ్లీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 12.50 గంటలకు రాహుల్ గాంధీ.. మాజీ సీఎం  దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలతో రాహుల్‌ భేటీ అవుతారు. పార్టీ పరిస్థితి, వ్యూహాలపై చర్చిస్తారు. ఆ తరవాత రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ సభ్యత్వ సమన్వయకర్తలతో ఫొటోలు దిగుతారు. ఆ తర్వాత ఈ సాయంత్రం 5.50 గం.కు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానశ్రయం  నుంచి దిల్లీ బయలుదేరి వెళ్తారు. మొత్తం మీద రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్‌ శ్రేణులకు ఊపునిస్తోంది. వరంగల్ సభలో రాహుల్ ప్రసంగం ఆకట్టుకుందని కాంగ్రెస్ శ్రేణులు మురిసిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: