ఆ అవార్డుతో కాంగ్రెస్లో చిచ్చు పెట్టిన మోదీ..?
గులాం నబీ అజాద్ సేవలను దేశం గుర్తించినా.. కాంగ్రెస్ మాత్రం గుర్తించలేదన్నారు. కాంగ్రెస్కు ఆయన సేవలు అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ సెటైర్ వేశారు. పద్మభూషణ్ దక్కించుకున్న ఆజాద్ కు కపిల్ సిబల్ శుభాకాంక్షలు తెలిపారు. కపిల్ సిబల్తోపాటు శశిథరూర్ కూడా అజాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేతకు అవతలి పక్షం గుర్తింపు ఇవ్వడం కూడా ఓ మంచి సంప్రదాయమేనని శశి థరూర్ అన్నారు. మొత్తానికి మోదీ.. ఒక్క అవార్డుతో కాంగ్రెస్లో చిచ్చుపెట్టారన్నమాట.