కరోనా : తెలంగాణ స్పీకర్ కు మరొకసారి..!
అయితే ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి లో ఉన్నటువంటి ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి. ఈ సమయంలో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు అందరూ పరీక్షలు చేయించుకొని ఈ జాగ్రత్తలతో ఉండాలని సూచించారు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా స్పీకర్ పోచారం కరోనా బారిన పడ్డారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఆయనకు కొవిడ్-19 సంభవించింది. మరోవైపు కరోనా నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలకు ఈనెల 30 వరకు సెలవులను పొడిగించింది ప్రభుత్వం.