చిత్ర‌ప‌రిశ్ర‌మ : క‌రోనా క‌లక‌లం.. ఐసీయూలో ల‌తా మంగేష్క‌ర్

N ANJANEYULU
దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రోజురోజుకూ తీవ్రతరం దాల్చుతుంది. సెలెబ్రిటీలు వరుసగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్  సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా భారత రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్-19 పాజిటివ్ గా న‌మోదు అయింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు సమాచారం.
లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. 2019 నవంబర్ లో లతా మంగేష్కర్ వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగాఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు, ఆరోగ్యం దృష్ట్యా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.  కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని లతా మంగేష్కర్ అభిమానులు ప్రార్థిస్తున్నారు. మ‌రోవైపు ఇవాళ  రేణూ దేశాయ్ ఆమె కుమారుడు అకీరా నందన్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని రేణూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోవాలని సూచ‌న‌లు చేసారు.  ఇక వీరితో పాటు ఇండస్ట్రీలో ఇప్పటికే బండ్లగణేష్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు తమన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నటుడు సత్యరాజ్, హీరోయిన్ త్రిష సహా మరికొంతమంది కరోనా బారినపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: