బ్రేకింగ్ : కేంద్ర రక్షణశాఖ మంత్రికి కరోనా..!
తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, తేలిక పాటి లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం నేను హోంక్వారంటైన్లో ఉన్నాను అని ట్వీట్ లో వెల్లడించారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నా.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు కొవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని కోరారు.