బ్రేకింగ్ : కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రికి క‌రోనా..!

N ANJANEYULU
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి బీభ‌త్స‌మే సృష్టిస్తున్న‌ది. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి సెల‌బ్రిటీలు, రాజకీయ ప్ర‌ముఖులు ఇలా వారు వీరు అని తేడా లేకుండా క‌రోనా సోకుతుంది. తాజాగా మ‌రొక కేంద్ర మంత్రికి క‌రోనా వ్యాపించింది. కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కొవిడ్‌-19 బారిన ప‌డ్డారు. తాజాగా జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్టు రాజ్‌నాథ్‌సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.
త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ని, తేలిక పాటి ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్టు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమ‌వారం ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం నేను హోంక్వారంటైన్‌లో ఉన్నాను అని ట్వీట్ లో వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌ను కాంటాక్ట్ అయిన  ప్ర‌తి ఒక్క‌రినీ అభ్య‌ర్థిస్తున్నా.. వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రితో స‌హా ప‌లువురు మంత్రులు, రాజ‌కీయ నాయ‌కులు కొవిడ్ టెస్ట్ లు చేయించుకోవాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: