కరోనా : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి పాజిటివ్..!
ప్రస్తుతం ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్రెడ్డిలకు కరోనా సోకిన విషయం విధితమే. వారు కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పుడే కాస్త కరోనా నుంచి కోలోకుంటున్నారు. తెలంగాణ శనివారం 2,500 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం విస్తృతంగా చర్చలు నిర్వహిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది.