టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.తాను కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. చంద్రబాబు సీనియర్ గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేసాడని ప్రశ్నించారు. కుప్పంను అభివృద్ధి చేయాలని కలలు కన్నాడు అని చెబుతున్నారని, 14 ఏండ్ల కాలం సీఎంగా ఉండి ఏమి చేశారని ప్రశ్నించారు. ఐదేండ్లలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు దేవుడు అయ్యారని, చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టం అని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాయల్టీపై కన్సెషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే చంద్రబాబుకు ఈ బాద ఉన్నదని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు దుష్టపాలనను వదిలించుకోవడానికి 151 సీట్లు వైసీపీకి ఇచ్చారు అని, సిగ్గలేకుండా చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బాబును తప్పకుండా ఓడిస్తామని.. తప్పకుండా జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లాలోని ప్రజలు నమ్మరు అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.