కోవిడ్ ఉగ్రరూపం.. డాక్టర్లను వదలని వైనం..!
దీంతో ముంబై నగరంలో వైరస్ బారిన పడినటువంటి రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య 260కి చేరుకుంది. మహారాష్ట్ర రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించినది. వీరందరూ నాలుగు రోజుల వ్యవధిలోనే వైరస్ బారీన పడడం కలకలం రేకెత్తిస్తున్నది. ముంబైలోని వివిధ ఆసుప్రతులలో ఉన్న వైద్యులందరూ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు కరోనా.. మరొకవైపు ఒమిక్రాన్ వైరస్లు విరుచుకుపడుతున్న సమయంలో వైద్యులు మహమ్మారి బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది.