సంచ‌ల‌నం : టోల్ ప్లాజా సిబ్బందిపై ఎంపీపీ దాడి.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ ఎంపీపీ దాడి చేసారు. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా య‌ర్ర‌దొడ్డి టోల్ ప్లాజా వ‌ద్ద చోటు చేసుకున్న‌ది.  క‌దిరి ఎంపీపీ అమ‌ర్నాథ‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చి అక్క‌డ హ‌ల్ చ‌ల్ సృష్టించాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. బుధ‌వారం అర్థ‌రాత్రి త‌న అనుచ‌రుల‌తో టోల్ ప్లాజా వ‌ద్ద చేరుకున్న క‌దిరి మండ‌ల ఎంపీపీ అమ‌ర్నాథ‌రెడ్డి టోల్ కార్యాల‌యంలోని సిబ్బందిని త‌న వెంట తీసుకెళ్లిన‌ట్టుగా స‌మాచారం.
సిబ్బందిపై క‌దిరి ఎంపీపీ దాడి చేస్తున్న దృశ్యాలు అక్క‌డ ఉన్న‌టువంటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావ‌డం విశేషం. త‌న అనుచ‌రుల‌ను ఉద్యోగం నుంచి ఎందుకు తొల‌గిస్తున్నారంటూ ఎంపీపీ అమ‌ర్నాథ‌రెడ్డి ప్ర‌శ్నించారు.  ఆ తరువాత సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ సిబ్బంది చెప్పేది కూడా వినిపించుకోకుండా వారిపై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేయ‌డం ప్రారంభించాడు. అత‌ని వ‌ద్ద నుంచి త‌ప్పించుకునేందుకు సిబ్బంది ఓ స‌మ‌యంలో ప‌రుగులు పెట్టారు. ఇద్ద‌రూ టోల్ గేట్ సిబ్బందిని ఎంపీపీ అమ‌ర్నాథ‌రెడ్డి త‌న‌తో పాటే తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: