సంచలనం : టోల్ ప్లాజా సిబ్బందిపై ఎంపీపీ దాడి.. ఎక్కడంటే..?
సిబ్బందిపై కదిరి ఎంపీపీ దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం విశేషం. తన అనుచరులను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగిస్తున్నారంటూ ఎంపీపీ అమర్నాథరెడ్డి ప్రశ్నించారు. ఆ తరువాత సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ సిబ్బంది చెప్పేది కూడా వినిపించుకోకుండా వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడం ప్రారంభించాడు. అతని వద్ద నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది ఓ సమయంలో పరుగులు పెట్టారు. ఇద్దరూ టోల్ గేట్ సిబ్బందిని ఎంపీపీ అమర్నాథరెడ్డి తనతో పాటే తీసుకెళ్లినట్టు సమాచారం.