టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..!
పీసీరెడ్డిగా సినీ పరిశ్రమలో పేరు పొందిన ఆయన పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖర్రెడ్డి. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933లో అక్టోబర్ 14న జన్మించారు. 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన అనురాధ చిత్రంతో ఆయన దర్శకునిగా పరిచయమయ్యారు. అత్తలు-కోడళ్లు, విచిత్ర దాంపత్యం, ఇల్లు ఇల్లాలు, బడిపంతులు, తాండవ కృష్ణుడు, మానవుడు-దానవుడు, నాయుడు బావ, మానవుడు-మహనీయుడు, పుట్టింటి గౌరవం, ఒకే రక్తం, రాముడు-రంగడు, ఇలా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అయితే కృష్ణ హీరోగా మొత్తం 20 చిత్రాలు తెరకెక్కించారు పీ.సీ.రెడ్డి. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పని చేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పీ.ఎన్.రామచంద్రరావు వంటి వారు దర్శకులుగా రాణించారు. ఎన్టీఆర్తో కూడా బడిపంతులు సినిమాను చేసారు చంద్రశేఖర్రెడ్డి.