దారుణం : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..!

N ANJANEYULU
ఈ మ‌ధ్య కాలంలో రోడ్డు ప్ర‌మాదాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఘోరంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిన్న తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ జిల్లా చందంపేట మండ‌లంలో రెండు ద్విచ‌క్ర‌వాహ‌నాలు బ‌లంగా ఢీ కొట్టుకోవ‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అందులో ఒక‌రు డిండి మండ‌లం చెర్కుప‌ల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ భ‌ర్త కావ‌డం విశేషం.
తాజాగా  ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించిన‌ది. ఇద్దరు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందగా.. మ‌రొక ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రేణిగుంట మండ‌లం కుక్క‌ల దొడ్డి వ‌ద్ద ఈ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. రేణిగుంట నుంచి రైల్వే కోడురు వైపు వెళ్లుతుండ‌గా ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాన్ని కారు బ‌లంగా ఢీ కొట్టింది. లారీని ఓవ‌ర్‌టేక్ చేయ‌బోతుండ‌డంతో కారు మ‌రొక వాహ‌నాన్ని ఢీ కొట్ట‌డంతో ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ముగ్గురికీ తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో మృతుల‌ను క‌డ‌ప‌జిల్లా రాజంపేట మండ‌లం చెర్ల‌ప‌ల్లి ఎస్సీ కాల‌నీకి చంఎదిన ల‌క్ష్మ‌య్య‌(40), న‌ర్స‌మ్మ (60) గుర్తించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేసు న‌మోదు చేసుకుని రేణిగుంట అర్భ‌న్ పోలీసులు ద‌ర్యాప్తును చేప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: