దారుణం : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!
తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించినది. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా.. మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట మండలం కుక్కల దొడ్డి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రేణిగుంట నుంచి రైల్వే కోడురు వైపు వెళ్లుతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని కారు బలంగా ఢీ కొట్టింది. లారీని ఓవర్టేక్ చేయబోతుండడంతో కారు మరొక వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతులను కడపజిల్లా రాజంపేట మండలం చెర్లపల్లి ఎస్సీ కాలనీకి చంఎదిన లక్ష్మయ్య(40), నర్సమ్మ (60) గుర్తించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని రేణిగుంట అర్భన్ పోలీసులు దర్యాప్తును చేపడుతున్నారు.