ఆ హైవేపై కరెన్సీ నోట్ల కలకలం.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
ఆ హైవేపై కరెన్సీ నోట్ల కలకలం రేకెత్తిస్తున్న‌ది.  నోట్లు అన్నీ తుక్కుగా మార్చి త‌గ‌ల‌బెట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఈ నోట్లు భారీగానే ఉన్న‌ట్టుగా పేర్కొంటున్నారు. నిజామాబాద్ జాతీయ ర‌హ‌దారిపై క‌రెన్సీ నోట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. జిల్లాలోని బుస్సాపూర్ గ్రామ శివారు జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే క‌న‌ప‌డిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతూ ఉన్నాయి. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి వాటికి సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ముమ్మ‌రం చేస్తున్నారు పోలీసులు.
ఒక వాహ‌నం నుంచి ప‌డిపోయిన‌ట్టుగా పోలీసులు అనుమానం వ్య‌క్త చేస్తు ఉన్నారు. జాతీయ ర‌హ‌దారిపై త‌గ‌ల‌బెట్టిన‌వి దొంగ నోట్లా లేక అస‌లు నోట్లా అనేదానిపై విచార‌ణ జ‌రుగుతున్న‌ది. జాతీయ ర‌హ‌దారిపై సీసీటీవీ పుటేజీ ప‌రిశీలిస్తున్నారు పోలీసులు. ఎవ‌రు ఈ నోట్లకు కార‌ణం అనే కోణంపై విచార‌ణ చేప‌డుతూ ఉన్నారు. ఈ వ్య‌వ‌హారంపై బుస్సాపూర్ ప్రాంతంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో నిజామాబాద్ క‌రెన్సీ నోట్ల‌పై కోడై కూస్తుంది. విచార‌ణ‌లో ఏమి తేలుతుందో చూడాలి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: