బ్రేకింగ్ : తెలంగాణ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి


తెలంగాణ సరిహద్దుల్లో ...ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పరిధిలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య సోమవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్తులు మృతి చెందినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ ఆధ్యర్యంలోని గ్రేహౌండ్స్ పోలీసులకు, మవో యిస్టులకు మధ్య ఈ కాల్పులుజరిగాయని పోలీసు వర్గాలు ప్రకటించాయి. పసరపాడు అటవీ ప్రాంతంలో చర్లకు - కుర్ణపల్లికి మధ్య ప్రాంతంలో ఇరు వర్గాలకు కాల్పలు జరిగాయి. పోలీసులు తమకు సమాచారం అందడంతో ఈ ప్రాంతం అంతా జల్లేడ పడుతున్నారు. ఈ సమయంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్తు సీనియర్ నేత మధు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అధికారంగా ఎవరూ ప్రకటించ లేదు. మృతులలో నలుగురు మహిళా నక్సలైట్లు ఉన్నారని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఘటనా స్థలం దట్టమైన అటవీ ప్రాంతం కావడం వెలుపలి నుంచి ఘటనా స్థలానికి చేరుకోవండ కష్టంగా ఉందని, ఈ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: