సీఎం రిలీఫ్ ఫండ్ తో ధాన్యం కొనుగోలు చేయాలి : రేవంత్ రెడ్డి
సెప్టెంబర్లో సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీని కలిసి వచ్చిన తరువాత ఇంతవరకు ఏ కేంద్రమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేదు అని ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మూలంగా తెలంగాణ రైతులు మరణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు పీసీసీ చీఫ్. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని.. అదేవిధంగా కొవిడ్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అవినీతి భారీగా జరిగిందని ఆరోపణలు చేసారు రేవంత్రెడ్డి.