చంద్ర‌బాబు పేద‌ల ఇండ్ల కోసం ఏమి చేయ‌లేదు : స‌జ్జ‌ల

N ANJANEYULU
 ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న‌ది. తాజాగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  చంద్ర‌బాబుపై  కౌంట‌ర్ ఎటాక్ చేసారు. ఓటీఎస్ పై చంద్ర‌బాబు రాద్దాంతం చేస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి పేద‌ల ఇండ్ల కోసం ఏమి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.   శాస‌న స‌భ్యుల‌తో మాట్లాడాను. స్కూల్‌కు వెళ్లుతున్నాడంటా.. అటెండెన్స్ కూడా ఉన్న‌ది.  ప్ర‌భుత్వ యంత్రాంగం చేసేది  ఇది త‌ప్పు అని చంద్ర‌బాబు అబ్బ‌ద్దాలు చెబుతున్నార‌ని పేర్కొన్నారు. పేద‌ల నోటికాడిది తీసివేయ‌వ‌ద్దు అని స‌జ్జ‌ల స్ప‌ష్టం చేసారు. కావాల‌ని చెడ్డ‌పేరు తీసుకురావాల‌ని చూస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని హెచ్చరించారు. చంద్ర‌బాబు పేద‌ల ఇండ్ల కోసం ఏమి చేయ‌లేదు. ఏది ఇస్తే దాని ప్ర‌కార‌మే న‌డ‌వాల‌ని చంద్ర‌బాబు భ్ర‌మ‌లో ఎందుకు ఉంటారో అర్థం కావ‌డం లేదు. ఆయ‌న ముఖ్య‌మంత్రి చేసిన విష‌యం కూడా మ‌రిచిపోయారేమో.. ఈ మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌జ‌లే బుద్ది చెప్పారు.

చంద్ర‌బాబు ఏమి మాట్లాడినా మేము   ప‌ట్టించుకోం. మంచి ప‌ని మీద ఆందోళ‌న పెడితే రియాక్ట్ అవ్వ‌క త‌ప్పుతారా... జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు పీఆర్సీ రిక్రూట్మెంట్ చేయ‌కుండా ఉన్నా మేము వ‌చ్చాక చేసామ‌ని.. కొవిడ్ లేకుంట ఉంటే వారికి పీఆర్సీ క‌ల్పించేవాళ్ల‌మ‌ని.. ఉద్యోగుల స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం స‌రిగ్గా అర్థం చేసుకున్నాం. ఇటీవ‌ల‌నే ముఖ్య‌మంత్రి చెప్పారు.  ముఖ్యంగా ఓటీఎస్ విష‌యంలో ఎవ‌రూ బ‌ల‌వంతం పెట్ట‌లేద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: