రోశయ్య హయాంలోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష : మంత్రి హరీశ్రావు
దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర శాసన సభలో 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత కేవలం రోశయ్యకే దక్కుతుందన్నారు హరీశ్రావు. రాష్ట్రంలో ఆయన చేయని పదవీ లేదని.. గౌరవం లేదని.. ఆయన పనిచేసిన అందరూ సీఎంలో మన్ననలు పొందారని పేర్కొన్నారు.
మాజీ సీఎం రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ముఖ్యంగా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని గుర్తు చేసారు. రోశయ్య హయాంలోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని.. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు రోశయ్యతో చర్చలు జరిపాం అని గుర్తు చేశారు హరీశ్ రావు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు హరీశ్ రావు.