కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం : చంద్రబాబు నాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య మొత్తం 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని చంద్రబాబు గుర్తు చేసారు. అయితే రోషయ్య ముఖ్యంగా వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర కలిగిన ఆర్థిక మంత్రి. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేసిన ఘనత రోశయ్యకు ఉన్నది. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని గుర్తు చేసారు చంద్రబాబు. వివాదరహితుడిగా నిలిచారని, తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు టీడీపీ అధినేత. రోశయ్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.