కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం : చంద్ర‌బాబు నాయుడు

N ANJANEYULU
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  మాజీ ముఖ్య‌మంత్రి, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క మాజీ గ‌వ‌ర్న‌ర్ కొనిజేటి రోశ‌య్య మృతి చెంద‌డం ప‌ట్ల ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్త చేసారు. ముఖ్యంగా రోశ‌య్య  పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారని పేర్కొన్నారు.  
 ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోష‌య్య మొత్తం  16 సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టి రికార్డు సృష్టించారని చంద్ర‌బాబు గుర్తు చేసారు. అయితే రోష‌య్య ముఖ్యంగా వ‌రుస‌గా ఏడుసార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన చ‌రిత్ర క‌లిగిన ఆర్థిక మంత్రి. న‌లుగురు ముఖ్య‌మంత్రుల వ‌ద్ద ప‌ని చేసిన ఘ‌న‌త రోశ‌య్య‌కు ఉన్న‌ది.  విద్యార్థి సంఘ  నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని గుర్తు చేసారు చంద్ర‌బాబు. వివాదరహితుడిగా నిలిచారని, తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు టీడీపీ అధినేత‌. రోశ‌య్య‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్ర‌క‌టించారు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: