కరోనా కష్టసమయాల్లో ఎంతో మంది పేదలకు హెల్ప్ చేసి హెల్పింగ్ స్టార్గా మారిన సోనూసూద్ గురించి అందరకీ తెలిసిన విషయం విధితమే. కరోనా మహమ్మారి వేళ ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ నాయకులు తమ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని ఇటీవల సోనూ సూద్ వ్యాఖ్యానించడంతో అది సంచలనంగా మారినది. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో సోనూ చేరుతున్నారని, త్వరలో నిర్వహించే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఉంటారని కూడా ఈ మధ్య వార్తలు తెగ వినిపించాయి.
ఇది ఇలా ఉండగా.. హెల్పింగ్ స్టార్, సినీనటుడు సినీ నటుడు సొనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో వరద బాధితుల కష్టాలపై సోనూ స్పందించారు. సూద్ చారిటీ ఫౌండేషన్ తరఫున సుమారు రెండువేల బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలు తీర్చేందుకు కిట్లను పంపించారు సోనూసూద్. ఒక్కొక్క కిట్లో బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు నిత్యవసర సరుకులున్నాయి. ఇవాళ్టి నుంచి బాధిత కుటుంబాలకు ఈ కిట్లను పంపిణి చేసేందుకు సోనుసూద్ ఫౌండషన్ వాలంటీర్లు ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేసారు.