పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు ఉన్న బకాయిలను 36 వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినది. తాజా ఈ జీవో ప్రకారం పింఛనుదారులకు పింఛను, గ్రాట్యుటీ బకాయిలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందజేస్తామని వివరించింది. 2020 ఏప్రిల్ 1 తరువాత మరణించిన పింఛన్ దారుల కుటుంబాలకు ఫిబ్రవరి 1న బకాయిలు చెల్లిస్తాం అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. జనవరి పెన్షన్తో సహా ఒక్కో పింఛన్ దారునికి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా పింఛన్ లభించనున్నది.