హైదరాబాద్ లో నవ వధువు అనుమానాస్పద మృతి
హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన రషీద్తో 27 రోజుల క్రితం షఫియా ఫాతిమా అనే యువతితో వివాహం అయినది. అయితే అత్తవారింట్లోనే ఫాతిమా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫాతిమా ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న వెంటనే నవ వధువు కుటుంబ సభ్యులు ఆమె అత్తారింటికి చేరుకున్నారు. పోలీసులు ఫాతిమా మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రెయిన్బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఫాతిమాను అకారణంగా కొట్టి చంపారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వధువు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.