హైదరాబాద్ లో నవ వధువు అనుమానాస్పద మృతి

N ANJANEYULU
హైదరాబాద్ నగరంలో ఓ నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం ప్ర‌స్తుతం కలకలం రేకెత్తిస్తున్న‌ది.  భర్త, అత్త మామల వేధింపులు తాళ‌లేక‌నే ఆ నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్టు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి చెందిన ఘటన పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వ‌చ్చిన‌ది.  నవ వధువు షఫియా ఫాతిమా(21) వివాహం జ‌రిగి క‌నీసం నెల రోజులు  కూడా గ‌డ‌వ‌క ముందే  ప్రాణాలను కోల్పోయింది.
హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన రషీద్‌‌తో 27 రోజుల క్రితం  ష‌ఫియా ఫాతిమా అనే యువతితో వివాహం అయిన‌ది.  అయితే అత్తవారింట్లోనే ఫాతిమా అనుమానాస్పద స్థితిలో మృతి చెంద‌డంతో స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  ఫాతిమా ఘటన వెలుగులోకి వచ్చింది.  విష‌యం తెలుసుకున్న వెంటనే నవ వధువు కుటుంబ సభ్యులు ఆమె అత్తారింటికి చేరుకున్నారు.  పోలీసులు ఫాతిమా మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రెయిన్‌బజార్  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ముఖ్యంగా ఫాతిమాను అకారణంగా కొట్టి చంపారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని   వధువు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: