టీఆర్ఎస్Vs బీజేపీ : ఆరిపోయే దీపం అంటూ..కేసీఆర్ పై ఈటెల సంచలన వ్యాఖ్యలు

N ANJANEYULU
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌లో ఈటెల రాజేంద‌ర్ ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి బీజేపీతో పాటు ఈట‌ల కూడా పుల్ జోష్ మీద ఉన్నారు. ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా టీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్‌పై విమర్శ‌నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా మ‌రొక‌సారి ఈట‌ల రాజేంద‌ర్  సీఎం కేసీఆర్ పై సంచల‌న వ్యాఖ్య‌లు చేసారు.  కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ  విమ‌ర్శ‌లు చేసారు.  తెలంగాణలో బీజేపీకి తిరుగు లేదని  ఈట‌ల త‌న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు ఈట‌ల‌.  కరీంనగర్ లో టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఓడిపోతున్న‌ట్టు  జోస్యం చెప్పారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు ఈట‌ల‌.  కరీంనగర్ జిల్లా నుండి చాలా మంది బీజేపీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. త్వ‌ర‌లోనే కరీంనగర్ లో టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పారు. ఆదిలాబాద్‌లో కూడా జెడ్పీటీసీ రాజేశ్వర రెడ్డి పోటీలో  ఉంచామ‌ని వెల్ల‌డించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: