టీఆర్ఎస్Vs బీజేపీ : ఆరిపోయే దీపం అంటూ..కేసీఆర్ పై ఈటెల సంచలన వ్యాఖ్యలు
తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు ఈటల. కరీంనగర్ లో టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఓడిపోతున్నట్టు జోస్యం చెప్పారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు ఈటల. కరీంనగర్ జిల్లా నుండి చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. త్వరలోనే కరీంనగర్ లో టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పారు. ఆదిలాబాద్లో కూడా జెడ్పీటీసీ రాజేశ్వర రెడ్డి పోటీలో ఉంచామని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.