వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
అదేవిధంగా మరో 4 నెలల పాటు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 2022 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కొనసాగించాలని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం పడనున్నది. ఈ విడతలో 163 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను కేంద్రం విడుదల చేయనుంది. దీనిద్వారా ప్రతివ్యక్తికీ ప్రతి నెల 5 కేజీల ఆహారధాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనున్నది.