కోలుకుంటున్న కైకాల.. అసత్య ప్రచారాలు వద్దు..!
ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆరోగ్యం విషమంగా ఉండిందని, ఇప్పుడు మాత్రం కొంచెం పర్వాలేదని, ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నాం అని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన బీపీ కంట్రోల్లోకి వచ్చిందని, కిడ్నీల పనితీరు మెరుగైందని వివరించారు. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం బాగానే ఉన్నది, రోజు రోజుకు కాస్త మెరుగు పడుతున్నదని సత్యనారాయణ కుమార్తె రమాదేవి తెలిపింది. నాన్న గారి ఆరోగ్యంపై అసత్య ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నాన్న కోలుకుంటున్నారని, ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు రమాదేవి.