సీఎం జగన్ ప్రకటపై అందరి ఆసక్తి
హై కోర్టులో మెమో రూపకంగా ఇవ్వాలని హై కోర్టు సూచించినట్టు ఏజీ తెలిపారు. రాజధానిపై అధ్యయానికి జీఎస్ రావు కమిటీ ఏర్పాటు చేశారు. అది నివేదికను కూడా ఇచ్చింది. అదేవిధంగా హై పవర్ కమిటీకి కూడా ఏపీ ప్రభుత్వం నివేదికను సమర్పించింది. న్యాయ రాజధానిపై కర్నూలు భవిష్యత్ ఏమిటనేదానిపై ఆసక్తి నెలకొన్నది. ముఖ్యంగా అమరావతి, విశాఖ రెండు రాజధానులుగా కొనసాగే అవకాశం కనిపిస్తుందని సమాచారం. మూడు రాజధానుల అంశం పూర్తిగా రద్దు చేస్తారా లేక రెండు రాజధానులు ప్రవేశపెట్టనున్నారా అని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే కొత్త చట్టం పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.