వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త..!
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముఖ్యంగా రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలలోని వరద బాధితులకు ఉచిత సహాయం అందనున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు పర్యటించాలని జగన్ ఆదేశించిన విషయం విధితమే. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు. ప్రజలకు తక్షణ సహాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా వరదల కారణంగా జరిగిన ఆస్తినష్టం, పంట నష్టంపై అంచెనాలను ప్రభుత్వానికి అధికారులు అందించాలని సూచించారు. మరోవైపు వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు వేసుకునేలా వాళ్లకు విత్తనాలను అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్.