నారాలోకేష్ పై మంత్రి శంకర్ నారాయణ ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి శంక‌ర్ నారాయ‌ణ త‌న‌దైన శైలిలో కామెంట్ చేసారు. రేపు నారా లోకేష్ జిల్లాకు వ‌స్తే విద్యార్థుల త‌ల్లిదండ్రులు మెడ‌పట్టుకొని బ‌య‌ట‌కు గెంటి వేయండి అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ విద్యార్థుల జీవితాల‌లో ఆడుకుంటుంద‌ని, వారిని బ‌లిప‌శువులు చేసే ప్ర‌య‌త్నం చేస్తోందని పేర్కొన్నారు మంత్రి.

ఎయిడెడ్ పాఠ‌శాల‌లు వారికి ఇష్టం  వ‌చ్చిన‌ట్టు ఉంటేనే ప్ర‌భుత్వం ఆధీనంలోకి తీసుకురావ‌చ్చు. లేకుంటే లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంటుంది. స్కూల్ పిల్ల‌ల దాడితో ముఖ్య‌మంత్రి త‌ల‌దించుకోవాల‌ని ప‌లువురు నేత‌లు పేర్కొంటున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం టీడీపీ పోరాటం చేస్తుంద‌ని, అందుకే నారా లోకేష్ వ‌స్తున్నాడ‌ని ప్ర‌క‌ట‌న చేయ‌గానే మండిపోతున్నారు మంత్రి. అదేవిధంగా రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్ విష‌యంలో ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొని ఉంది. అగ్గి వేస్తే భ‌గ్గుమ‌న్న‌ట్టు అధికారం, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: