ఎమ్మెల్యేలు స్వ‌యంగా డ‌బ్బులు పంచి వెళ్లారు : ఈటెల‌

ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఈటెల రాజేంద‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
అందరూ ఏకపక్షంగా వ్యవహరించారని..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని ఈటెల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదని ఆయ‌న అన్నారు. ఎమ్మెల్యే లు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని.. బస్లలో ఇవిఎం కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నన్ను ఓడించడానికి కెసిఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారని ఈటెల వ్యాఖ్యానించారు.


పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఈటెల రాజేంద‌ర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గమ‌ని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమీషన్ కు ఈ విష‌యంపై ఫిర్యాదు చేస్తున్నామ‌ని కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెప్తున్నారన్నారు. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా..? అంటూ ఈటెల రాజేంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: