వైసీపీ నేత సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
ఇది ఇలా ఉండగానే సోషల్ మీడియాలో ఓ వైసీపీ నేత సంభాషణ వైరల్ మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం కలిగొట్లలో వైసీపీ ఎంపీటీసీగా ఓడిపోయిన అభ్యర్థి మరో వ్యక్తితో ఫోన్ లో సంభాసించారు. వైసీపీకి ఓట్లు వేస్తేనే పథకాలు ఉంటాయని, సైకిల్కు సపోర్ట్ చేస్తామంటే పథకాలు పీకేస్తామని వైసీపీ నేత హెచ్చరించారు. జగనన్న ఇండ్ల స్థలాలు ఇచ్చింది వైసీపీ. అయితే ఎన్నికల్లో తనకు సపోర్టు చేయకుండా టీడీపీకి ఓట్లు వేస్తే ఊరుకుంటామా అని వైసీపీ నేత బెదిరింపులకు పాల్పడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి వైసీపీకి మద్దతు ఇస్తే సరే.. లేదంటే అందరి ఇండ్ల స్థలాలు పీకిపారేస్తామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కలిగొట్ల ఆ వైసీపీ నేత ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.